క్రీడాభూమి

స్టార్లు రెడీ! నేటి నుంచి జాతీయ బాడ్మింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 1: జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు స్టార్లంతా సంసిద్ధమయ్యారు. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించిన కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న తెలుగు తేజం పివి సింధు, మాజీ ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ తదితరులు గురువారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో ఆడనున్నారు. అదే విధంగా హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామన్, సాయి ప్రణీత్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, పారుపల్లి కశ్యప్, డానియల్ ఫరీద్ పురుషుల సింగిల్స్‌లో, రితుపర్ణ దాస్, అనురా ప్రభుదేశాయ్ తదితరులు మహిళల సింగిల్స్‌లో పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్/ చిరాగ్ శెట్టి, మనూ అత్రి, సుమీత్ రెడ్డి, అర్జున్/ రామచంద్రన్ జోడీలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప/ సిక్కీరెడ్డి, సంజనా సంతోష్/ ఆరతి సారా సునీల్, జక్కంపూడి మేఘన/ రామ్ పూర్వీష జోడీ టైటిల్ వెటను కొనసాగిస్తాయి.