క్రీడాభూమి

బెల్జియంలో కమల్ జోడీకి కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ హాన్ (బెల్జియం), నవంబర్ 4: ప్రతిష్టాత్మక బెల్జియం ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాలెంజ్ టోర్నమెంట్‌లో భారత జోడీ ఆచంట శరత్ కమల్, జి.సత్యన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్స్‌లో వీరు జర్మనీకి చెందిన రెండో సీడ్ ప్యాట్రిక్ ఫ్రాంజిస్కా, రికార్డో వాల్థర్ చేతిలో 2-3 గేముల తేడాతో ఓటమిపాలవడంతో కాంస్య పతకాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. తొలి గేమ్‌ను కమల్, సత్యన్ 7-11 తేడాతో చేజార్చుకున్నప్పటికీ ఆ తర్వాత విజృంభించి ఆడి 11-7, 11-5 తేడాతో వరుసగా రెండు గేములను గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడంతో 5-11, 5-11 తేడాతో చివరి రెండు గేములను చేజార్చుకున్న కమల్, సత్యన్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. కాగా, ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సనిల్ షెట్టి కూడా చక్కగా రాణించాడు. ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న స్థానిక ఏడో సీడ్ ఆటగాడు సెడ్రిక్ నుటింక్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానం), చైనీస్ తైపీకి చెందిన 9వ సీడ్ ఆటగాడు చెంగ్ తింగ్ లియావో (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ స్థానం)పై విజయం సాధించి సత్తా చాటుకున్న సనిల్ షెట్టి ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో 1-4 తేడాతో రికార్డో వాల్థర్ చేతిలో ఓటమిపాలై పతకాన్ని దూరం చేసుకున్నాడు. అలాగే మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన మానికా బాత్రా, వౌమా దాస్ కూడా చక్కటి ప్రదర్శనతో అలరించారు. చైనీస్ తైపీ జోడీ యు వెన్ హువాంగ్, యు ఝున్ లీపై 2-3 తేడాతో విజయం సాధించిన మానికా, వౌమా ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో 2-3 చైనీస్ తైపీకే చెందిన హియెన్ జు చెంగ్, హింగ్ యిన్ లియు చేతిలో ఓటమిపాలయ్యారు.

చిత్రం..ఆచంట శరత్ కమల్