క్రీడాభూమి

నేషనల్ బాడ్మింటన్ సెమీస్‌కు సింధు, సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, నవంబర్ 6: నేషనల్ సీనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ మెడలిస్టులు పివి.సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకున్న ‘ఆంధ్రావాలా’ కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్ సోమవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో 21-17, 21-10 గేముల తేడాతో ఆకర్షీ కశ్యప్‌పై విజయం సాధించగా, మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి.సింధు 21-11, 21-17 తేడాతో శ్రేయాన్షీ ప్రదేశీని ఓడించింది. అలాగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత టాప్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 21-17, 23-21 గేముల తేడాతో శుభమ్ ప్రజాపతిపై విజయం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.