క్రీడాభూమి

ఫైనల్ బెర్తుల కోసం.. శ్రీకాంత్ వర్సెస్ ప్రణయ్, సింధు వర్సెస్ సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, నవంబర్ 7: సీనియర్ నేషనల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తు కోసం ‘ఆంధ్రావాలా’ కిదాంబి శ్రీకాంత్, ‘జెయింట్ కిల్లర్’ హెచ్‌ఎస్.ప్రణయ్, మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తు కోసం ‘తెలుగు తేజం’ పివి.సింధు, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకున్న శ్రీకాంత్ మంగళవారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 21-16, 21-18 గేముల తేడాతో రైజింగ్ షట్లర్ లక్ష్యా సేన్‌ను మట్టికరిపించగా, రెండో సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన ప్రణయ్ 21-14, 21-17 తేడాతో శుభాంకర్ డేపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. అలాగే మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన పివి.సింధు (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం) 17-21, 21-15, 21-11 తేడాతో రుత్వికా శివానీపై విజయం సాధించగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 21-11, 21-10 గేముల తేడాతో ఐదో సీడ్ క్రీడాకారిణి అనురా ప్రభుదేశాయ్‌ని ఓడించింది.