క్రీడాభూమి

విశ్వవిజేతలకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 5: న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టుకు ముంబయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధికారులు కెప్టెన్ పృథ్వీ షా, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు ఇతర సభ్యులకు సాదరంగా ఆహ్వానం పలికారు. సాయంత్రం 3.30 గంటలకు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకున్న క్రికెటర్లకు ఎంసీఏ సీనియర్ ప్రతినిధులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. కాగా, ప్రపంచ కప్‌ను గెల్చుకున్న యువ ఆటగాళ్లను చుడాటానికి ముంబయి ఏయిర్‌పోర్టుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా సెంచూరియన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.