క్రీడాభూమి

ఫేవరిట్ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 15: మహిళల క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై వనే్డ సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు టీ-20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లోనూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి టీ-20 ఇంటర్షేనల్‌ను ఏడు వికెట్ల తేడాతో గెల్చుకున్న భారత్ శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. అన్ని విభాగాల్లోనూ ఈ హర్మన్‌ప్రీత్ బృందం బలంగా కనిపిస్తుండగా, స్వదేశంలో ఉనికిని చాటుకోవడానికి దక్షిణాఫ్రికా జట్టు తంటాలు పడుతున్నది. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన తీరు భారత్‌ను ఫేవరిట్‌గా నిలబెడుతున్నది. ఈ మ్యాచ్‌ని గెల్చుకొని, ఆధిక్యాన్ని పెంచుకోవడంతోపాటు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు భారత మహిళలు ప్రయత్నించనున్నారు. వారిదే విజయమన్న వాదన వినిపిస్తున్నది.