క్రీడాభూమి
హైదరాబాద్ విద్యార్థికి కరాటేలో జాతీయ స్థాయి పతకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 April 2018
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: హైదరాబాద్ విద్యార్థికి కరాటే పోటీల్లో జాతీయ స్థాయిలో రజత పతకం లభించింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జూనియర్, 30 కేజీల విభాగంలో 11 ఏళ్ల డి.దుర్గాసాయి తనిష్క రజత పతకం సాధించాడు. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సాయి తనిష్క, కోచ్ కీర్తన్ కోండ్రు నేతృత్వంలో శిక్షణ పొందాడు. జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి, ఈ పతకాన్ని అందుకోవడం పట్ల తల్లిదండ్రులు డి.రవిశంకర్, భవాని హర్షం వ్యక్తం చేశారు.
చిత్రం..కరాటేలో జాతీయ స్థాయి పతకం అందుకుంటున్న
దుర్గాసాయ