క్రీడాభూమి
హాల్ ఆఫ్ ఫేమ్ సెమీస్కు రామనాథన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 July 2018
న్యూఢిల్లీ, జూలై 20: ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ డబ్ల్యుటీపీ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్కు భారత టెన్నిస్ ఆటగాడు రాంకుమార్ రామనాథన్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వరల్డ్ 161 ర్యాంకర్ రామనాథన్ 7-5, 6-2 స్కోరుతో ప్రత్యర్థి, కెనడాకు చెందిన వాసిక్ పోస్పిసీల్పై విజయం సాధించాడు. గంట 18 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో రామనాథన్ మొదటి సెట్లో తడబడిన్నప్పటికీ, రెండో సెట్లో 6-2తో ప్రత్యర్థిపై సునాయాస విజయం సాధించాడు. న్యూపోర్టులో జరుగుతోన్న టోర్నీలో సెమీస్కు చేరిన 23ఏళ్ల చెన్నై కుర్రాడు రామనాథన్, 2011 తరవాత సెమీస్కు చేరిన భారత ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.