క్రీడాభూమి

దిగ్గజ ఆటగాడికి దగ్గర్లో కోహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: గత కొనే్నళ్లుగా తాను చూస్తున్న యువ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. దిగ్గజ ఆటగాడికి మరికొంత దూరంలో కోహ్లీ ఉన్నాడని అనానడు.
కోహ్లీ తనకున్న అమోఘమైన తెలివితేటలతో అత్యుత్తమ క్రికెటర్‌గా ఘనతను అందుకున్నాడని, దిగ్గజ ఆటగాడిగా కీర్తి గడించేరోజు దగ్గర్లోనే ఉందని అన్నాడు. ఎక్కడైనా, ఏ మ్యాచ్‌లలోనైనా తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు సాధించడం ఒక్కటే అతని తెలిసిన విద్య అని ధోనీ అన్నాడు. ‘రన్ ఆడమ్’ అనే యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్, మెంటర్ అయిన ధోనీ ఈ యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడాడు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు క్రికెట్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసిన విషయాన్ని ధోనీ గుర్తు చేశాడు.