క్రీడాభూమి

‘రెండో వనే్డలో గట్టి పోటీ ఇస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: ఆస్ట్రేలియా-ఏతో జరిగిన తొలి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన తాము బుధవారం జరిగే రెండో వనే్డలో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తామని భారత్-ఏ మహిళా క్రికెట్ జట్టు ధీమా వ్యక్తం చేస్తోంది. సోమవారం ఇక్కడ ఎంసీఏ బాండ్రా కుర్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వనే్డలో ఆస్ట్రేయాలి చేతిలో పరాజయం పాలైన భారత్ 1-0 తేడాతో వెనుకబడి ఉంది. మూడు వనే్డల సిరీస్‌లో భాగంగా బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించేందుకు సమష్టిగా పోరాడతామని భారత జట్టు కెప్టెన్ పూనమ్ రౌత్ స్పష్టం చేసింది. కాగా, వనే్డ సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో 50 ఓవర్లు కలిగిన టీ-20 సిరీస్‌లో కూడా తలపడుతుంది.