క్రీడాభూమి
ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ ముగిసిన సింధు, శ్రీకాంత్ పోరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పారిస్, అక్టోబర్ 27: ఫ్రెంచ్ ఓపెన్లో భారత షట్లర్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. శుక్రవారం రాత్రి జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో వీరిద్దరూ పరాజయం పాలయ్యారు. 40 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో మూడో సీడ్ సింధు చైనా క్రీడాకారిణి హె బింగ్జియావో చేతిలో 13-21, 16-21 తేడాతో ఓటమి చెందింది. ఈ ఏడాది ఇదే ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడం సింధుకు ఇది రెండోసారి. అదేవిధంగా పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ టాప్ సీడ్ జపాన్కు చెందిన కెంటో మొమోటో చేతిలో 16-21, 19-21 తేడాతో ఓడిపోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన వివిధ మ్యాచ్లలో ఇదే ప్రత్యర్థి చేతిలో శ్రీకాంత్ ఐదుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇదిలావుండగా పురుషుల డబుల్స్లో భారత అన్సీడెడ్ ద్వయం సాత్విక్రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు.