క్రీడాభూమి
ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్లో సైనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 January 2019
జకర్తా, జనవరి 26: భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్లో ఆరో సీడ్ చైనాకు చెందిన క్రీడాకారిణి హే బిన్గ్జియావోతో తలపడిన సైనా ఘన విజయం సాధించింది. మ్యాచ్ తొలి సెట్ను బిన్గ్జియావో 18-21 తేడాతో కైవసం చేసుకోగా, సైనా రెండు , మూడో సెట్లను 21-12, 21- 18 తేడాతో కైవసం చేసుకొని విజయం సాధించింది.