క్రీడాభూమి

సైనాదే ఇండోనేషియా మాస్టర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది. స్పెయన్ షట్లర్ కరొలినా మారిన్‌తో ఆదివారం ఫైనల్‌లో తలపడిన సైనా గేమ్ ముగియకుండానే టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కరొలినా, సైనాపై ఆదిపత్యం ప్రదర్శించింది. ఓ దశలో 7-2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కరొలినా కాలికి గాయమైంది. కొద్దిసేపు చికిత్స తీసుకున్న అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయంట్లు సాధించిన అనంతరం మరోసారి గాయం తిరగబెట్టడంతో ఫైనల్ పోరు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్ గెలవడంతో ఈ ఏడాది తొలి మాస్టర్స్ టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది. కాగా మలేషియా మాస్టర్స్ సెమీ ఫైనల్‌లో సైనా కరొలినా చేతిలో ఓడిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ఇండోనేసియా మాస్టర్స్ ఫైనల్ చేరినా తుది పోరులో ఓటమి చవిచూసింది.

చిత్రం.. ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నమెంట్ గెలిచిన సైనా నెహ్వాల్