క్రీడాభూమి

ధోనీ రాణించిన ప్రతిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ ధనాధన్ ధోనీ టీ20ల్లో టాప్ స్కోర్ చేసిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడింది. ప్రస్తుత మ్యాచ్‌లో 39 పరుగులు చేయగా, భారత్ 80 పరుగులతో ఓడిపోయంది. 2017 కాన్పూర్‌లో ఇంగ్లాండ్‌పై 36 పరుగులు చేయగా, జట్టు ఏడు వికెట్ల తేడాతో పరాజయం చెందింది. 2016 నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 30 పరుగులు చేయగా, భారత్ 47 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
అదేవిధంగా 2012 ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అదే ఏడాది సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వరుసగా 38, 48 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా, సిడ్నీలో 31 పరుగుల తేడాతో జట్టు పరాజయం పాలైంది.