క్రీడాభూమి
బంధన్ బ్యాంకు శాఖను ప్రారంభిస్తున్న గంగూలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, మే 13: ప్రో కబాడీ లీగ్ రాబోయే సీజన్కోసం శుక్రవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో వాయువ్య రైల్వేలో క్లర్క్గా పని చేస్తున్న డిఫెండర్ మోహిత్ షిల్లర్ను బెంగళూర్ బుల్స్ జట్టు 53 లక్షల రూపాయల అత్యధిక మొత్తానికి దక్కించుకుంది. రెండో సీజన్ విజేత అయిన యుముంబా జట్టునుంచి చిల్లర్ను అత్యధిక మొత్తానికి బెంగళూరు జట్టు దక్కించుకోవడమే ఈ రోజు వేలంలో హైలైట్. వేలంలో పాల్గొన్న టోర్నమెంట్లోని ఎనిమిది జట్లూ మూడో సీజన్లో జట్టులో ఉండిన ఇద్దరు ఆటగాళ్లను కొనసాగించడానికి అనుమతించారు. 2014లో జరిగిన ప్రోకబాడీ టోర్నమెంట్ తొలి సీజన్కు ముందు జరిగిన ఆటగాళ్ల తొలి వేలంలో షిల్లర్కు పలికిన ధర రూ.5.75 లక్షలే. ఇంత ధర పలుకుతానని తాను ఊహించలేదని, తనకు ఎంతో సంతోషంగా ఉందని ఢిల్లీ సమీపంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన చిల్లర్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా విలేఖరులకు చెప్పాడు.