క్రీడాభూమి
రెండో రౌండ్లోకి సింధు, శ్రీకాంత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 April 2019
కౌలాలంపూర్, ఏప్రిల్ 3: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ బుధవారం రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఒలింపిక్, వరల్డ్ ఛాంపియన్షిప్ వెండి పతక విజేత సింధు వరల్డ్ నెంబర్ 20 ర్యాంకర్, జపాన్కు చెందిన అయా ఓహోరితో జరిగిన పోరులో 22-20, 21-12 సెట్ల తేడాతో ఆరో విజయాన్ని సాధిం చింది. ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా ఇండోనేషియాకు చెందిన ఇషాన్ వౌలానా ముస్త్ఫాను 38 నిమిషాల్లోనే 21-18, 21-16 తేడాతో మట్టికరిపించాడు. సింధు తర్వాతి మ్యాచ్లో కొరియాకు చెందిన సుంగ్ జీ హ్యున్తో తలపడుతుండగా, శ్రీకాంత్ థాయ్ లాండ్ ఆటగాడు ఖోసిట్ పెట్ప్రదాబ్తో గురువారం పోటీ పడనున్నారు.