క్రీడాభూమి
టీమిండియాకు ఆటవిడుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాంచెస్టర్: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఆదివారం జరిగిన వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్లో 89 పరుగుల తేడాతో చిత్తుచేసిన టీమిండియాకు రెండు రోజుల ఆటవిడుపు లభించింది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడి, డక్వర్త్ లూయిస్ విధానాన్ని అనుసరించి పాక్ లక్ష్యాన్ని సవరించినప్పటికీ, భారత్ సునాయాస విజయాన్ని న మోదు చేసిన విషయం తెలిసిందే. ప్ర పంచకప్లో ఇంతవరకూ ఏడు పర్యాయాలు భారత్ను ఢీకొన్న పాక్కు చే దు అ నుభవం మిగిలిందేతప్ప ఒక్క మ్యాచ్నీ గెల్చుకోలేకపోయింది. ఇలావుంటే కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తన తర్వాతి మ్యాచ్ని ఈనెల 22న అఫ్గానిస్తాన్తో ఆడుతుంది. కా బట్టి, సోమ, మంగళవారాల్లో వి శ్రాంతి తీసుకొని, బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్ను కొనసాగిస్తుంది. తీవ్ర ఒత్తిడి మధ్య మ్యాచ్ ఆడిన తర్వాత లభించిన విరామాన్ని క్రికెట ర్లు సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు.