క్రీడాభూమి

మార్కరమ్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 27: ఇండియా బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్ జట్టుతో ఇక్కడ జరుగుతున్న త్రీ డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండోరోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మొదటి రోజు గురువారం ఆట పూర్తిగా వర్షార్పణ మైన విషయం తెలిసిందే. రెండోరోజు మధ్యాహ్నం తరువాత ఆట ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యా టింగ్ ఎంచుకుంది. చింతలవలసలోని పీవీజీ రాజు-ఏసీఏ స్పోర్ట్స్ కాం ప్లె క్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఉదయం 11.55 గంటలకు టాస్ వేశా రు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణా ఫ్రికా జట్టు బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ అయడెన్ మార్కరమ్ (100) సెంచరీ సాధించి, రిటైర్డ్ హార్ట్‌గా వెను దిరగ్గా. డీన్ ఎల్గార్ 6, తునీస్ డిబ్రుయన్ 6, హమాజీ 55 (నాటౌట్), డూప్లెసిస్ 9 పరుగులు చొప్పున చేశారు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ బౌలర్లలో ఉమేష్‌యాదవ్, ఇసాన్ చెరో వికెట్, డీఏ జడేజా 2 వికెట్లు పడగొట్టాడు.