క్రీడాభూమి

ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మొత్తం 17 పతకాలతో తన పోరాటాన్ని ముగించింది. వీటిలో ఏడు పసిడి పతకాలతో పాటు నాలుగు రజత పతకాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 14 స్వర్ణ పతకాలతో ఈ పోటీల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 11 పసిడి పతకాలతో చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో భారత్‌కు మూడో స్థానం లభించింది. ఇంతకుముందు తైపీలో 2014లో జరిగిన గత ఎడిషన్‌లో మొత్తం 12 పతకాలు (2 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు) సాధించి ఐదో స్థానంలో నిలిచిన భారత జట్టు ప్రస్తుతం రెండు స్థానాలను మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకడం గమనార్హం. ప్రస్తుత ఎడిషన్‌లో చివరి రోజైన సోమవారం భారత అథ్లెట్లు చక్కటి ప్రదర్శనతో రాణించి మూడు స్వర్ణ పతకాలతో పాటు మూడు రజత పతకాలను మరో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. దీంతో భారత్ పతకాల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుని ఉన్నత స్థితికి చేరుకోగలిగింది.