తెలంగాణ

ఉయ్యాలే ఉరితాడైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, జూలై 4: రోజూ ఉల్లాసంగా ఆడుకునే ఉయ్యాలే ఆ చిన్నారి మెడకు ఉరితాడైంది. హృదయ విదారకరకమైన ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దండేపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు గోళ్ళ మంజుల కుమారుడు రిషీత్ (10) ఉయ్యాలపై అడుతూ ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకోవడంతో ఉయ్యాలపైనే మరణించాడు. తల్లి మండల కేంద్రంలోని గ్రామసభకు వెళ్లగా, తండ్రి గోళ్ళ రాయమల్లు దండేపల్లి మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న నిర్మల్ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ చేపట్టిన రాస్తారోకోలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రిషీత్ తనకు ఇష్టమైన ఉయ్యాలపై ఉల్లాసంగా ఆడుకుంటూ తనువు చాలించాడు. ఈ విషయాన్ని మృతుడి తండ్రి రాయమల్లుకు పక్కింటివారు తెలపడంతో చికిత్స నిమిత్తం మ్యాదరిపేటలోని ఓ ప్రవేట్ అసుపత్రికి తరలించగా వైద్యులు బాలుడు మృతి చెందాడని స్పష్టం చేశారు. దీంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రిషీత్ మ్యాదరిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ప్రజల సేవలో ఉండగా, కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. లక్సెటిపేట, దండేపల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎంపిపి దంపతులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను లక్సెటిపేట సిఐ బి.మోహన్ బంధువులను అడిగి తెలుసుకున్నారు.

రిషీత్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు