తెలంగాణ

మల్లన్నసాగర్ పాక్‌లో ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: మల్లన్నసాగర్ పాకిస్తాన్‌లో ఉందా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌కు వెళ్ళే వరకూ తాము విశ్రమించేది లేదని ఆమె శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మల్లన్న సాగర్‌పై ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. కెసిఆర్ ఫాంహౌస్‌లో ఉంటూ పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఆమె విమర్శించారు. మల్లన్న సాగర్ బాధితులను కలిసేందుకు తాము వెళుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు వెళితే 144 సెక్షన్ అంటున్నారని, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపులు నిర్వహిస్తే అనుమతి ఇస్తున్నారని ఆమె విమర్శించారు. ఎంసెట్-2 లీకేజీతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనతో ఉన్నా ముఖ్యమంత్రి ఏమీ స్పందించడం లేదని ఆమె విమర్శించారు. లోగడ రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినట్లే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎందుకు తప్పించడం లేదని అరుణ ప్రశ్నించారు.