తెలంగాణ

కాంగ్రెస్ నేతల కట్టడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 7: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు రావడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ట్‌స్టేషన్‌లకు తరలించారు. మల్లన్నసాగర్ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తెస్తామని ముందుగానే ప్రకటించిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే నారాయణఖేడ్‌లో మాజీ ఎంపి సురేశ్ షెట్కార్‌తోపాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మెదక్‌లో పట్లోల్ల శశిదర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పటాన్‌చెరులో అరెస్ట్ చేశారు. కాగా నర్సాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు గజ్వేల్ వైపు వాహనాలలో బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే పోలీసులు సమయస్పూర్తితో నేతలను అరెస్ట్ చేసి నర్సాపూర్‌కు తరలించారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని నేతలపై పోలీసులు నిఘా పెట్టడంతోపాటు ముందస్తుగా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.