తెలంగాణ

గాంధీజీకి గవర్నర్, కెసిఆర్ నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో గల బాపు ఘాట్ వద్ద గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, అధికారులు నివాళులు అర్పించారు. తొలుత ముఖ్యమంత్రి కెసిఆర్ బాపుఘాట్‌కు చేరుకున్నా అనంతరం అక్కడికి చేరుకున్న గవర్నర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి బాపుఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలు, భజనల కార్యక్రమంలో సంగీత నృత్య కళాశాల బృందాలు గాంధీజీకి ఇష్టమైన గీతాలు ఆలపించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపి కె కేశవరావు, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.