తెలంగాణ

2018కి మెట్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆగస్టు 2018 నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది నవంబర్‌కు మియాపూర్- ఎల్‌బి నగర్ మార్గం పూర్తి చేయాలని గడువు విధించారు. క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో బుధవారం మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిని సిఎం సమీక్షించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను కొంతలో కొంతైనా తీర్చడానికి మెట్రోరైలు పనులు వేగవంతం చేయాలన్నారు. మొదట మియాపూర్-ఎల్‌బి నగర్ మార్గాన్ని పూర్తి చేసి మిగతా పనులను 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెసిఆర్ భరోసానిచ్చారు.