స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-177

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవానికి ధనత్యాగంలో సుఖముంది. దాచుకోవడంలో దుఃఖముంది. ఏ కారణంచేతనయినా ఐశ్వర్యం అరకొరగా లభిస్తే ఏమిచేయాలి? దానిని భగవదర్పణంగా పరోపకారార్థమే త్యాగం చేయాలా? వేదమావిధంగా చెప్పలేదు. ‘యద్యశ్రాతం మమత్తన’ ఐశ్వర్యం అరకొరగా ఉంటే అధికంగా ఆశించక దానితో సంతృప్తి చెందుమని హితవు చెప్పింది. అంటే స్వల్పసంపద నిమిత్తంగా దుఃఖపడరాదు. దానిని ఇంకా ఇంకా పెంచి దాచుకోవడానికి ప్రయత్నించరాదు అని వేదోపదేశ పరమార్థం. ఇదే లాభ-అలాభాలు సంభవించినపుడు పొంగిపోరాదు. క్రుంగిపోరాదన్న భగవద్గీత సందేశం. ఇట్టివాడినే ‘స్థితప్రజ్ఞు’డని గీత బహుధా ప్రశంసించింది.
**
మాకు మంచి ధనమేదో నీవే చెప్పు
కిం నో అస్య ద్రవిణం కద్ధ రత్నం వి నో వోచో జాతవేదశ్చికిత్వాన్‌
గుహాధ్వనః పరమం యన్నో అస్య రేకు పదం న నిదానా అగన్మ॥ ఋ.4-5-12.
భావం:- సర్వజ్ఞుడైన ఓ అగ్నీ! నీవు అన్నీ తెలిసినవాడవు. అందువలన మా రుూ సంశయాలకు సమాధానాలను తెలుపు. వివిధ రూపాలలో ఉన్న ధనాలలో ఉత్తమమైన ధనమేది? సంపదలలో అమూల్యమైన సంపద ఏది? అనేక జన్మలుగా ప్రయాణిస్తున్న ఈ జీవన మార్గం రహస్యమైనదా? ఇక ఇట్టి సంశయాత్మకమైన మార్గంలో మేము నడువజాలం.
వివరణ:- లోకంలో మానవులు ఇది ధనమనేభావనతో ఎన్నింటినో సంపాదించుకొంటున్నారు. అవి ఏవీ కూడడ తమ వద్ద నిలువక ఒక్కొక్కటి జారిపోతున్నాయి. ఈ అనుభవం జీవితంలో అందరకు ఎదురయ్యేదే. సామాన్యులు పోయినదానిని తిరిగి ఎలా పొందాలా? అని తీవ్రంగా ప్రయత్నిస్తారు. కాని ఎవరో విచారణశీలురు మాత్రమే వ్యాకులచితుతలై దాని మర్మమేమిటో తెలిసికొనేందుకు ప్రయత్నిస్తారు. మరి ఆ మర్మాన్ని ఎవరు చెప్పగలరు? ఒక్క సర్వజ్ఞుడైన భగవానుడు తప్ప. ఈ మంత్రంలో తన సంశయాలకు సమాధానాలను విప్పి చెప్పమన్న ఒక తాత్త్వికుని విన్నపం ఇలా వర్ణించబడింది. ‘వి నో వోచో జాతవేదశ్చికిత్వాన్’ ‘‘సర్వజ్ఞుడవైన ఓ అగ్నీ! నీ కన్నియూ తెలుసు. నా రుూ సంశయాలకు సమాధానాలను తెలుపు.’’ ‘కిం నో అస్య ద్రవిణమ్’ ‘‘వివిధ రీతులుగా ఉన్న ఈ ధనాలలో ఏది ఉత్తమమైన ధనం?’’ తృప్తితో, సంతోషంతో జీవిత యాత్రను సుఖంగా నడిపించేది ధనం మాత్రమే. అలాకాక వస్తూ - పోతూ ఉండే ఈ ధనం వలన శాశ్వతమైన తృప్తి కలిగేనా? నీవు దానశీలురైన దాతల కొఱకు ఋగ్వేదంలో ‘దధాతి రత్నం విధతే’ (ఋ.4-12-3) ‘‘రత్నాలను నిర్మిస్తున్నావు లేదా రత్నాలను దాతలకు ప్రదానం చేస్తున్నావు’’ అయితే ‘కద్ధరత్నమ్’ ఆ రత్నాలలో అమూల్యమైనది ఏది?
మేము సంసార చక్రభ్రమణంలో పడి చిరకాలంగా అదే సంసార మార్గంలో నడుస్తూ వస్తున్నాం. ఆ మార్గంలో ఎంతకాలం ప్రయాణం చేయాలి? ‘గుహాధ్వసః పరమం యన్నో అస్య’ ఆ మార్గంలోని రహస్యమేమిటి?’ దానికేమైనా లక్ష్యంగాని, పరమగమ్యం గాని ఉందా? మాకేమీ అర్థం కావడం లేదు. కేవలమది ప్రయాణమేనా? లేదా అందులో యేమైనా సార్థక్యముందా? అది మకు తెలియకూడని రహస్య విషయమా? విచారణ చేస్తే మా బుద్ధికి ఏమీ అందడం లేదు. నీవు ‘చికిత్వాన్’ సర్వమూ తెలిసినవాడవు. నీవు మాత్రమే తెలియజెప్పగలవాడవు. నీవే చెప్పకుంటే ‘రేకు పదం న నిదానా అగన్మ’ ‘‘సందేహంతో అడుగువేస్తూ నడువజాలం. ‘‘సందేహాస్పద స్థితిలో కలిగేది భయమే.
‘సంశయాత్మా వినశ్యతి’ ‘‘సంశయ- మనస్కుడు నశిస్తాడు’’ అని భగవద్గీత (4-40) చెప్పింది. సంశయగ్రస్తుడు తన కర్తవ్యాన్ని కూడ నిర్వహించలేడు. అట్టివానికి భవిష్యత్తు కూడ సిద్దించదు. కాబట్టి జీవిత భవిష్యత్తును సంరక్షించుకొనేందుకు ముందుగా సంశయ విముక్తుడు కావాలి. కాబట్టి ఓదేవా! మా రుూ సర్వసంశయాలను విచ్ఛేదం చేసి మమ్ము సన్మార్గాన నడిపించు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు