తెలంగాణ
తెలంగాణ సాధన కార్యకర్తల ఘనతే: కెసిఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 27 April 2016
ఖమ్మం: ఉద్యమ సమయంలో ఎన్ని అవరోధాలు, అవహేళనలు ఎదురైనా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ధీరులుగా నిలిచినందునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇక్కడ బుధవారం తెరాస ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల కృషి వల్లే తెలంగాణ ప్రజలు ఇపుడు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారన్నారు. అన్ని ఎన్నికల్లోనూ తెరాసకు ప్రజలు పట్టం కడుతున్నారని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో 90 డివిజన్లను గెలవడం అపూర్వ విజయమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుస్తుందని, ఇందుకు కార్యకర్తలు, పార్టీ నేతలు అండగా ఉండాలన్నారు. సరైన దిశా నిర్దేశం కోసం ప్లీనరీని నిర్వహిస్తున్నామన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు.