తెలంగాణ
పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 August 2016
హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకు 12 రోజుల పాటు ప్రతిరోజూ 200 పైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు, ఏపీలో శ్రీశైలం, విజయవాడ ప్రాంతాలకు మహత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. 50 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లాలనుకుంటే వారి కోసం ప్రత్యేక బస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. విజయవాడకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు, బీచుపల్లికి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు, నాగార్జునసాగర్కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఎంజీబీఎస్ నుంచి అందుబాటులో ఉంటుంది.