తెలంగాణ

దోచుకునేందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంథని, మార్చి 2: తెలంగాణ ప్రభుత్వం దోచుకునేందుకే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తుందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ శాసన సభ స్పీకర్ దివంగత శ్రీపాధ రావు జయంతి సందర్బంగా మంథనిలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. మంథని ఉప సర్పంచ్ పుప్పాల బాగ్యలక్మి అత్తమ్మ పుప్పాల లక్ష్మి స్మారకార్ధం ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ట్యాంక్‌ను మజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి పారంబించారు.అనంతరం మంథనిలోని లక్ష్మి భారతి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.దివంగత శ్రీపాదరావు స్పికర్‌గా ఉన్నప్పుడు నేను మంత్రిగా పని చేసానని అన్నారు. శ్రీపాధరావు మంచి స్నేహా శీలి అని ఆయన అందరితో కలసి మెలసి ఉండేవాడని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వత డబ్బును దోచుకునేందుకే ప్రాజెక్టులు చేపట్టారన్నారు. చేసేది కొండంత చెపుప్పకునేది కొండంత అనే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీపాధరావు తనయుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంథని నియోజక వర్గంలోకాంగ్రేస్ ప్రభుత్వం హయాంలోనే మంథని నియోజకవర్గం అన్నివిధాల అభివృద్ది చెందిందని అన్నారు. ఈ సభలో కాంగ్రేస్ నాయకులు విజయరామరావు, కాంగ్రేస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శశిభూషన్ కాచే,కాంగ్రేస్ పార్టీ మండలాద్యక్షుడు శ్రీనివాస్, మంథని ఉప సంర్పంచ్ కాంగ్రేస్ కార్యాకర్తలు పాల్గోన్నారు.