తెలంగాణ

దండు మల్కాపూర్‌లో 377 ఎకరాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో 377 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వాడకు త్వరలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేస్తారని టిఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. వంద శాతం కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పే ఈ ఇండస్ట్రీయల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పార్కుకు అనుబంధంగా పక్కనే 200 ఎకరాల్లో మోడల్ హౌసింగ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని ఆయన చెప్పారు. ఇండస్ట్రీయల్ పార్కుకు కేటాయించిన భూములకు మూడు విడతల్లో కలిపి నిర్ణయించిన మొత్తం రూ.56.11 కోట్లను టిఎస్-ఐఐసికి టిఐఎఫ్ ప్రతినిధులు చెల్లించినట్లు ఆయన తెలిపారు.