తెలంగాణ

ప్రశాంతంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఇంగ్లీషు పేపర్ -1 పరీక్ష శనివారం నాడు ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 4,93,996 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,73,480 మంది హాజరయ్యారు. 20,516 మంది అంటే 4.5 శాతం మంది గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని చెప్పారు. నిర్మల్‌లో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు, మెదక్‌లో ఒకరు, సూర్యాపేటలో ఒకరు, మహబూబ్‌నగర్‌లో నలుగురిపై ఈ కేసులు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.