తెలంగాణ

దేశమంతా కమల వికాసం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 3: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజాదరణకు నిదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అభివర్ణించారు. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ విజయోత్సవ సంబరాల్లో పాలొన్న సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
కమ్యూనిస్టులకు కంచుకోటగా భావించే త్రిపురలో 25ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చి ఒక్క ఎమ్మెల్యే సైతం లేని బీజేపీ మూడింట రెండొంతల మెజార్టీతో అధికారంలోకి రావడం బీజేపీపెరిగిన ప్రజాదరణను చాటిందన్నారు. త్రిపురలో 1.3శాతం ఓట్లు మాత్రమే ఉన్న తమ పార్టీకి ఈ ఎన్నికల్లో 50శాతం ఓట్లను సాధించడం విశేషమన్నారు. నాగాలాండ్‌లో గతంలో 1.8శాతం ఓట్లతో ఒక ఎమ్మెల్యే మాత్రం ఉండగా బీజేపీ ఈ ఎన్నికల్లో 13శాతం ఓట్లు, ఎన్‌డిఏ 33శాతం ఓట్లు సాధించి ప్రభుత్వం స్థాపించనుందన్నారు.