తెలంగాణ

జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో నూతన పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) పేరుతో నూతన పార్టీ ఆవిర్భవించింది. ఆదివారం పార్టీ ఆవిర్భావ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. పార్టీని ప్రకటించిన అనంతరం ఆకుపచ్చ, తెలుపు, నేవీబ్లూ రంగులతో కూడిన త్రివర్ణ జెండాను చంద్రకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీలు, దౌర్జన్యాలు, ఎన్‌కౌంటర్లు, పార్టీ ఫిరాయింపులు లేని సమాజ నిర్మాణం కోసం తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. సామాజిక న్యాయం, కుల వివక్షతను రూపుమాపడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు.
రాబోవు సాదారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలిపారు.