తెలంగాణ

మోదీకి లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: వచ్చే ఎన్నికల్లో మోడికి లబ్దిచేకూర్చేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ నాటకాన్ని తెరపైకి తీసుకువచ్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న కేసీ ఆర్ దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని మాట్లాడటం సిగ్టుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తాననడం విడ్డూరమని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీకి మద్దతు తెలిపిన ఆయన ఒక్కసారిగా ఈ విషయాన్ని ప్రకటించడాన్ని ఎవరైనా అర్ధం చేసుకోగలుగుతారని తెలిపారు.