తెలంగాణ

వెయ్యి కోట్లతో కందుల కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల విలువైన కందులను కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు తెలిపారు. పంటల ఉత్పత్తుల సేకరణపై సంబంధిత అధికారులతో అసెంబ్లీ హాలులో గురువారం రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చర్చించారు. కందులు, మినుములు, సెనగ, ఎర్రజొన్న తదితర పంటల ఉత్పత్తుల కొనుగోళ్లపై సమగ్రంగా చర్చించారు. కందుల కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయల చెల్లించామని, మరో 400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన నిధులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.