తెలంగాణ

జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, మే 28: తెలంగాణ ఉద్య మంలో.. రాష్ట్ర ఏర్పాటులో కీల కపాత్ర వహించిన జర్నలిస్టుల సేవలు గుర్తించి జగిత్యాల జిల్లా కోరుట్లలో వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామ ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం కోరుట్ల శివారు వెంకటసాయినగర్‌లో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. అలాగే, ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్ రూం ఇల్లు అందిం చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులు అందరికీ హెల్త్‌కార్డులు అందించామని, దీనిద్వా రా ప్రతి జర్నలిస్టుకు నాణ్యమైన వైద్యం లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ పాల్గొన్నారు.

చిత్రం..కోరుట్లలో జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు
భూమిపూజ చేస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవిత