తెలంగాణ

రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 29: త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) కృషి చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర యువత టీజేఎస్ వైపే చూస్తుందని, వారి సమస్యలే ఎజెండాగా పని చేస్తామన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటుచేసిన టీజేఎస్ జెండా ఆవిష్కరణలో కోదండరాం ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు, రైతులకు టీజేఎస్ అండగా ఉంటుందన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా ఇన్‌చార్జి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పార్టీలో చేరిన వారిని ఆహ్వానిస్తున్న కోదండరాం