తెలంగాణ

ధర్మారెడ్డి కాలువ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, అక్టోబర్ 2: ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను వేగవంతం చేసి దీపావళి వరకు రైతులకు నీళ్లు అందించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అధికారులను ఆదేశించారు. గోకారం చెరువు నుంచి సాగుబావిగూడెం వరకు ఉన్న కాలువను పలువురు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వలిగొండ మండలం గోకారం నుండి రామన్నపేట మండలం సాగుబావిగూడెం వరకు ఉన్న మేజర్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలం శివనేనిగూడెం వరకు నీటి సరఫరా జరిగితే అక్కడ నీళ్లు స్టోరేజీచేస్తే అక్కడి నుండి వనిపాకల, వట్టిమర్తి గ్రామాలకు నీళ్లు సాఫీగా వెళ్తాయన్నారు. కాలువ పనులు వేగవంతం అయ్యేట్లు అధికారులు చర్యలు తీసుకొని దీపావళినాటికి రైతులకు కాలువ నీళ్లు అందించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఆయన వెంట నీటిపారుదల ఎస్‌ఈ హమీద్‌ఖాన్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.