తెలంగాణ
ఓటర్ల నమోదుకు గడువు పెంచాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 October 2018
హైదరాబాద్, అక్టోబర్ 2: ఓటర్ల నమోదుకు ఇంకా గడువు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి (సీఇవో) రజత్ కుమార్ను కోరారు. మంగళవారం మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఇవో రజత్కుమార్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తగినంత సమయం ఇవ్వకపోవడంతో కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోలేదని అన్నారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాల్లో సవరణలకూ సమయం సరిపోలేదన్నారు. కాబట్టి మరి కొంత గడువు ఇవ్వాలని ఆయన సీఇవోను కోరారు.