తెలంగాణ

సీఎం సొంత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాంధీ భవన్‌కు చేరుకున్న ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులకు పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. జగదేవ్‌పూర్ ఎంపీపీ ఎర్ర రేణుకా యాదగిరి, ఎంపీటీసీలు మమతా భాను, కవితా యాదగిరి, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ ఏల్లోల్ల ఐలయ్య, ముగులు మండలం కోత్యాల తాజా మాజీ సర్పంచ్ విజయ్, సీనియర్ నాయకులు రామకృష్ణ పంతులు, సుదర్శన్ రెడ్డి, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు తమ అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తున్నదన్నారు. కేసీఆర్ కుయుక్తులను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం నుంచే నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారంటే టీఆర్‌ఎస్ ఓటమికి నిదర్శనమని ఉత్తమ్ అన్నారు.

చిత్రం..కాంగ్రెస్‌లో చేరిన గజ్వేల్ నేతలతో ఉత్తమ్