తెలంగాణ

దొరా..నీవు మాట తప్పావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 4: దొరా.. నీవు మాట తప్పావు, తెలంగాణ ప్రజలు ఇక నీ పరిపాలనను వద్దనుకుంటున్నారు. దొర పాలన.. దోపిడీ పాలన నుంచి విముక్తి చెందాలకుంటున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయనర్ మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు.
గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావంతో ప్రచార కార్య క్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రె స్ వ్యవహరాల ఇన్‌చార్జి రామచంద్రకుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్కు, పొన్నం ప్రభాకర్, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయనర్ మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ప్రారంభించారు. ముందుగా ఐదవ శక్తిపీఠం జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అలంపూర్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశాంతి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. దొరా.. నీవు మాట తప్పావు ఇక నిన్ను తెలంగాణ ప్రజలు వదులుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను, నీ భజన పరులను, నీ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సినిమాలో రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో ప్రస్తుతం నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సైతం అన్ని కష్టాలు పడ్డారని విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్యం సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని, ప్రజాస్వామ్య తెలంగాణ త్వరలోనే రాబోతోందని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. తొమ్మిదో చెల్లిగా తనను ప్రపంచానికి కేసీఆర్ చూపించారని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి తీరా అర్థరాత్రి గొంతుకోసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇలా ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఆది కేసీఆర్ ఒక్కరేనని విజయ శాంతి తీవ్రంగా దుయ్యబట్టారు. సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ దేవతనేనని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లికి తెలంగాణను బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకుని సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దెదింపి దొరల, దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.
చిత్రం.. అలంపూర్ ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న విజయశాంతి