తెలంగాణ

బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: జనాభాలో సగం మంది ఉన్న బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీసీ భవన్‌లో ఆదివారం బీసీ సంఘాల కోర్ కమిటీ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది. ప్రతీ జిల్లాలో కనీసం ఐదు స్థానాలను బీసీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోర్ కమిటీ డిమాండ్ చేసింది. బీసీలకు అన్యాయం చేసే పార్టీలను ఓడించడమే లక్ష్యంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆత్మగౌరవ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్టు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో 112 కుల సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించి బీసీలకు అన్యాయం చేసే పార్టీలను ఓడిస్తామన్నారు.

చిత్రం.. సమావేశంలో ప్రసంగిస్తున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్