తెలంగాణ

ఓటమి భయంతో టీఆర్‌ఎస్ దాడులు: యాష్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్‌ఎస్ తమపై దాడులకు పాల్పడుతున్నదని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం ఖాయమని ఆయన శనివారం విలేఖరుల సమావేవంలో అన్నారు. పోలింగ్ రోజున తమ పార్టీ అభ్యర్థులు రోహిత్ రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతున్న తనపై మెట్‌పల్లి వద్ద దాడి చేయడం సాధారణ దాడి కాదని, హత మార్చేందుకు జరిగిన కుట్ర అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అది పక్కా ప్రణాళికతో చేశారని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తున్నదని ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గతంలో తప్పు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రజా కూటమికి అనుకూలంగా ఉన్నందుకే టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మధుయాష్కీ తెలిపారు.