తెలంగాణ

ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, డిసెంబర్ 14: తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించడంతోనే మరోసారి అధికారంలోకి వచ్చామన్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ ప్రజల మన్ననలు పొంది వారి అభీష్టం మేరకు పాలన సాగిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం రామాయంపేట, తిప్పనగుల్ల గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన ఆమె విలేఖరులతో మాట్లాడారు. కేసీఆర్ చరిష్మా ముందు కూటమి ఆటలు సాగలేదన్నారు. కేసీఆర్‌తోనే అభివృద్ది సాద్యమన్న ప్రజలు తెరాస అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. మళ్లీ అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆశయాలకు అనుగునంగా మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈగెలుపుతో బాద్యత మరింత పెరిగిందని, ప్రజల మద్య ఉండి సేవ చేస్తామన్నారు. గతంలో చెప్పిన విదంగా డిసెంబర్ 11 ఫలితాల తర్వాత కూటమి కుదేలైందని అన్నారు. ఆమె వెంట తెరాస సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, ఎంపీపీ పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మీ సంపత్, వైస్ ఎంపీపీ పల్లె జితెందర్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాపు యాదగిరి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు బాదె చంద్రం, నవాత్ కిరణ్, మెట్టు యాదగిరి, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
సన్మానించిన వైశ్య సంఘం నేతలు
రామాయంపేట: మెదక్ ఎమ్మెల్యేగా మరోమారు ఎన్నికైన పద్మాదేవేందర్‌రెడ్డిని శుక్రవారం వైశ్య సంఘం నాయకులు ఆమె స్వగృహంలో కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. వైశ్య సంఘం అద్యక్షులు మురికి రవీందర్, మండల అధ్యక్షులు మల్లేశం, మండల కార్యదర్శి అశోక్‌తో పాటు కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్, తోట కిరణ్, గౌరిశెట్టి శ్రీనివాస్, కోవూరి లక్ష్మణ్‌లతో పాటు తదితరులు కలిసి ఎమ్మెల్యేను సన్మానించారు.ఈసందర్బంగా అశోక్‌మాట్లాడుతూతెరాస హయంలో మెదక్ అన్నిరంగాలల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైశ్య సంఘంతో పాటు స్వర్ణకార,వంజరి, మున్నూరుకాపు సంఘం సభ్యులు తరలివెళ్లి అభినందనలు తెలిపారు.