తెలంగాణ

ఎన్నికల్లో ఓడిన వారికి ఎంపీ టిక్కెట్ ఇవ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: వివిధ ఎన్నికల్లో రెండు, మూడు సార్లు ఓటమి చెందిన వారికి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వరాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువగా యువకులకు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్, ఓయు జాక్ నుంచి టిక్కెట్లు కోరుతున్న వారికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి లేదా వివిధ పదవులకు పోటీ చేసి ఓడిపోయిన సీనియర్లకు పార్టీ పటిష్టత కోసం పార్టీ పదవులు ఇవ్వాలని, లేదా నామినెటెడ్ పదవులు ఇవ్వాలని జగ్గారెడ్డి ఆ లేఖలో కోరారు.