తెలంగాణ

వెంకన్నకు ఘనంగా క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, మార్చి 14: మండలంలోని కనుముక్కుల గ్రామం శ్రీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో క్షీరాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్యహోమం, బలిహరణం, తిరువీధి, గరుడవాహనం, నైవేధ్య నివేదన, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆయన చైర్మన్ కోట మల్లారెడ్డి, పుష్పలత, గ్రామసర్పంచ్ కోట అంజిరెడ్డి, ఉపసర్పంచ్, పాక నర్సింహ్మ, నాయకులు గారెడ్డి జంగారెడ్డి, భోగ చంద్రశేఖర్, దోర్నాళ కరుణాకర్, గడ్డం జగన్నాధరెడ్డి, పాండు రంగారెడ్డి, రంగ మధు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.