తెలంగాణ
కాళేశ్వరంలో వరుణ యాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
మహదేవపూర్, జూన్ 16: కరీంనగర్ మహదేవపూర్ మండ లంలో జిల్లా త్రివేణి సంగమమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గురువారం వరుణ యాగం నిర్వహించారు. మూడు నదుల సంగమమంలోని గోదావరి జలాలను కలశాల ద్వారా స్వామివారి ఆలయానికి తీసుకువచ్చి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక జలాభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలయ ఈఓ హరిప్రకాష్ అన్నారు. ఈ యాగ హోమ ప్రధాన ఉద్దేశం వర్షాలు బాగా కురిసి, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని తెలిపారు.