తెలంగాణ

ఐసీయూలో కాంగ్రెస్ పార్టీ: కృష్ణసాగర రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అంతిమ గడియలు వచ్చాయని అన్నారు. పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండే గెలవలేమనే ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన కొత్త పథకం ఓట్ల కోసం చేసిందేనని అన్నారు. అమలుకు నోచుకోని హామీలను రాహుల్ గాంధీ ఇస్తున్నారని అన్నారు. ఇది ఓటర్లను ఎర వేయడానికే ఉపయోగపడుతుందని చెప్పారు. పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ పేదలను వాడుకుని వదిలేసిందని అన్నారు. మళ్లీ పేదలను వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లెక్కలేకుండా పథకాలను ప్రకటిస్తోందని చెప్పారు.