తెలంగాణ

సబ్‌కా సాథ్.. వట్టి బూటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్’ అంటూ ప్రజలను మభ్యపెడుతోందని, ఇది వట్టి బూటకమని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్ర సర్కార్ ఎవరికీ చేయూతనివ్వలేదని..ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో పాలకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో 50వేల మంది ముస్లింలు వలస వెళ్లారని, కేంద్ర ప్రభుత్వం కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా పంపించలేకపోయిందన్నారు. కైరానా ఘటనలో హిందువుల వలసలపై బిజెపి సర్కార్ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బిజెపి ముస్లిం మైనార్టీల పట్ల వివక్ష చూపుతున్నాయని, సమాజ్‌వాది పార్టీ ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. తాము ఉత్తరప్రదేశ్‌లోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని, అలయెన్స్ ప్రతిపాదనలు వస్తే అందుకు కూడా సిద్ధమేనని ఒవైసీ ప్రకటించారు.