తెలంగాణ

కాంగ్రెస్‌కు కాలం చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఏప్రిల్ 25: పోరాటాలతో తెలంగాణను తెచ్చి బంగారు తెలంగాణగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీకి మనమందరం అండగా నిలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఊరూరా టీఆర్‌ఎస్‌ను గెలిపించి గులాబి ఎగురవేద్దామని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా బండా నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిస్తూ జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి జోష్‌గా మాట్లాడారు. కోమటిరెడ్డిలు మండలానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఫ్లోరైడ్‌తో ఈ ప్రాంత ప్రజలు అనేక బాధలు పడుతున్నారని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, అందుకే టీఆర్‌ఎస్‌ను గెలిపించి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పధంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. రోజుకో, పూటకో అబద్దాలు చెప్పి కాలం గడిపిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కాలం చెల్లిందన్నారు. 35ఏండ్లుగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న ఈ నార్కట్‌పల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరుకోవడం అభినందనీయమని, దీంతో ఈ ప్రాంతంలో టీఆర్‌ఎస్ సంపూర్ణ బలాన్ని పుంజుకుందని, పాత, కొత్త కలయికలతో కార్యకర్తలు సమన్వయంగా పని చేసి నరేందర్‌రెడ్డిని జిల్లాలో అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూ పాల్‌రెడ్డి, బీసీ కార్పోరేషన్ చైర్మన్ శంబయ్య, ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ దూ దిమెట్ల సత్తయ్య యా దవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు సత్తయ్య, పాల్గొన్నారు.

చిత్రం...కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి