తెలంగాణ

బీజేపీ నేత కిషన్ రెడ్డికి మాతృ వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి జీ కిషన్ రెడ్డి మాతృమూర్తి అండాలమ్మ గురువారం ఇక్కడ ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమారుల్లో చిన్న కుమారుడు జీ కిషన్ రెడ్డి. ఆమె భౌతిక దేహానికి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. కిషన్ రెడ్డికి తల్లి మరణం పట్ల రాష్టప్రతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్ రామచంద్రరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు.